బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలపై అనర్హత వేటు తప్పదా? చట్టం ఏం చెబుతోందంటే..!
- ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిక
- రాఘవ్ చద్దా, స్వాతి మాలీవాల్ సహా కీలక నేతలు పార్టీ మార్పు
- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతపై మొదలైన చర్చ
- మూడింట రెండు వంతుల సభ్యులు మారడంతో విలీనంగా పరిగణించే అవకాశం
- ఎంపీల భవిష్యత్తు రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయంపై ఆధారం
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి రాజ్యసభలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా బీజేపీలో చేరారు. రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, స్వాతి మాలీవాల్, హర్భజన్ సింగ్, అశోక్ మిత్తల్, రాజిందర్ గుప్తా, విక్రమ్జీత్ సాహ్నీ వంటి కీలక నేతలు కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 10 మంది సభ్యులున్న ఆప్కు పెద్దల సభలో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. ఈ పరిణామం ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంపై తీవ్రమైన చర్చకు దారితీసింది.
వారిపై అనర్హత వేటు పడుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద, ఒక సభలోని పార్టీ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మరో పార్టీలో చేరితే దానిని ఫిరాయింపుగా కాకుండా 'విలీనం'గా పరిగణిస్తారు. ఈ నిబంధన ప్రకారం వారిపై అనర్హత వేటు పడకపోవచ్చని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్కు చెందిన చక్షు రాయ్ అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమైనప్పుడు అప్పటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు దీనిని ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అయితే, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి దీనితో విబేధిస్తున్నారు. కేవలం రాజ్యసభలోని సభ్యులు విలీనమైతే సరిపోదని, మాతృసంస్థ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం బీజేపీలో చేరితేనే అది 'విలీనం' అవుతుందని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అనర్హత పిటిషన్ దాఖలు చేస్తే, దానిపై రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఛైర్మన్ వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు లేదా విలీనాన్ని ఆమోదించవచ్చు. ఆయన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
1960-70 దశకంలో జరిగిన భారీ పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికే 1985లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ ఏడుగురు ఎంపీల భవిష్యత్తు రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం, ఆ తర్వాత ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లపైనే ఆధారపడి ఉంది. ఈ లోగా వారు సాంకేతికంగా ఆప్ సభ్యులుగానే ఉన్నా, ఓటింగ్లో బీజేపీకి మద్దతిస్తే ఎన్డీయే బలం మరింత పెరగనుంది.
వారిపై అనర్హత వేటు పడుతుందా లేదా అనే దానిపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన ఒక కథనం ప్రకారం, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) కింద, ఒక సభలోని పార్టీ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది మరో పార్టీలో చేరితే దానిని ఫిరాయింపుగా కాకుండా 'విలీనం'గా పరిగణిస్తారు. ఈ నిబంధన ప్రకారం వారిపై అనర్హత వేటు పడకపోవచ్చని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్కు చెందిన చక్షు రాయ్ అభిప్రాయపడ్డారు. గతంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమైనప్పుడు అప్పటి ఛైర్మన్ వెంకయ్య నాయుడు దీనిని ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
అయితే, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి దీనితో విబేధిస్తున్నారు. కేవలం రాజ్యసభలోని సభ్యులు విలీనమైతే సరిపోదని, మాతృసంస్థ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం బీజేపీలో చేరితేనే అది 'విలీనం' అవుతుందని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా అనర్హత పిటిషన్ దాఖలు చేస్తే, దానిపై రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఛైర్మన్ వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు లేదా విలీనాన్ని ఆమోదించవచ్చు. ఆయన నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
1960-70 దశకంలో జరిగిన భారీ పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికే 1985లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ ఏడుగురు ఎంపీల భవిష్యత్తు రాజ్యసభ ఛైర్మన్ నిర్ణయం, ఆ తర్వాత ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లపైనే ఆధారపడి ఉంది. ఈ లోగా వారు సాంకేతికంగా ఆప్ సభ్యులుగానే ఉన్నా, ఓటింగ్లో బీజేపీకి మద్దతిస్తే ఎన్డీయే బలం మరింత పెరగనుంది.